Tuesday, May 7, 2024

సరస్వతీ దేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

బాసర: సరస్వతీ దేవి జన్మ నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మూల నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement