Thursday, May 2, 2024

ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మ‌కి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన -సీఎం జ‌గ‌న్

నేడు మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గ‌మ్మ‌కి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం జ‌గ‌న్ కి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్ కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎంకి మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా స్వాగతం పలికారు. జ‌గ‌న్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement