Tuesday, May 14, 2024

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

పెద్దపల్లిరూరల్‌, (ప్రభన్యూస్‌): అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు, ప్రయాణికులకు కరపత్రాలను పంచడంతోపాటు అవగాహన కల్పించేలా రూపొందించిన స్టిక్కర్లను అందించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై అగ్నిమాపక కేంద్రం అధికారి దేవనంది శ్రీనివాస్‌ వివరించారు. అలాగే బస్టాండ్‌ ఆవరణలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈకార్యక్రమంలో అధికారులు, సిబ్బంది మహేందర్‌రెడ్డి, చంద్రయ్య, మనోహర్‌, శ్రీనివాస్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement