Saturday, May 4, 2024

Bandi Sanjay: బీఆర్ఎస్ కూల్చే పార్టీ… బీజేపీ నిర్మించే పార్టీ.. ఎంపీ బండి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కు కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు.

ఆదివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో మానకొండురు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా సంజయ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, కనుమ పండగ మీ ఇంట సుఖ సంతోషాలను, సిరిసంపదలను నింపాలని అమ్మవారిని వేడుకుంటున్నానని తెలిపారు. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నడు.. పంచొద్దని ఎవరు వద్దన్నరు? ఎవరైనా పంచకుండా ఆయనను ఆపారా? అయినా బీఆర్ఎస్ నేతలు కూల్చేటోళ్లన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కూల్చినోళ్లే… కానీ మేం నిర్మించేటోళ్లం…భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడని ఎద్దెవా చేశారు. వేములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు డబ్బులు ఇస్తానని మోసం చేసినోడు కేసీఆర్ అని, మీకు బీజేపీని గురించి, హిందువుల గురించి మాట్లాడే అర్హతే లేద‌ని విమ‌ర్శించారు. ప్రజలు కేసీఆర్ ను మర్చిపోయారని, బయటకు వస్తే పట్టించుకునేదెవరు? ఆయన లోపల ఉన్నా.. బయట ఉన్నా తేడా ఏముంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? స్పష్టత లేదన్నారు. జాతీయ పార్టీ అన్నోళ్లు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలి. తెలంగాణలోనే క్యాండిడేట్లకు దిక్కులేదు.. ఇగ దేశంలో యాడ దొరుకుతార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement