Monday, April 29, 2024

NZB: ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షలు చోరీ.. దర్యాప్తు చేపడుతున్న పోలీసులు..

నిజామాబాద్ సిటీ, జనవరి14 (ప్రభ న్యూస్): ఓ ప్రైవేట్ బస్సులో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు చోరికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ముంబై నుంచి జగిత్యాల వెళ్తోంది.

అయితే ఆ బస్సులో హనుమంతు అనే వ్యక్తి సుమారు రూ. 13 లక్షలు తీసుకొని జగిత్యాలకు ప్రయానిస్తున్నాడు. సారంగాపూర్ డైరీ ఫార్మ్ వద్ద ఓ హైటల్ వద్ద బస్సు ఆపి ప్రయాణికులు చాయి తాగేందుకు ఆగారు. ఇదే అదునుగా భావించిన దుండగులు హనుమంతు బ్యాగు ను అపరించుకొని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న ఆరవటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రైవేట్ బస్సును టౌన్ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. బస్సులో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని దుండగుడు సీసీ కెమెరాకు చెయ్యి పెట్టి దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement