Saturday, May 11, 2024

మూడు త‌రాల పందిరి మంచం..

ఈవీ గణేష్‌ బాబు స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘కట్టిల్‌’. సృష్టి డాంగే కథా నాయిక . ఈ చిత్రం ‘పందిరిమంచం’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది.
తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్‌ సింగిల్‌ ”కోవెలలో… ” లిరికల్‌ సాంగ్‌ ని దర్శకుడు మోహన్‌ రాజా విడుదల చేశారు. ‘పుష్ప’ తర్వాత తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషలలో సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట ఇది. శ్రీకాంత్‌ దేవా సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు.
తరతరాలుగా ఒకే ఇంట్లో ఉన్న పందిరిమంచం కథ ఇది. ఒ క వంశంలోని మూడు తరాల పరంపర గురించి అందర్నీ ఆకట్టు -కునేలా చూపించారు. మాస్టర్‌ నితీష్‌, గీత-కై-లసం, సంపత్‌ రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ బి లెనిన్‌ కథ, కథనం అందించగా, కె ఎన్‌ విజయకుమార్‌ మాటలు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement