టీ20 మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్కు బిగ్ టార్గెట్ పెట్టింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఇండియా 181 పరుగులు చేసింది. పాకిస్తాన్ టార్గెట్ 182 పరుగులుగా ఉంది. దీంట్లో విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడంతో ఈ టార్గెట్ సాధ్యమయ్యింది. లేకుంటే ఇండియాకు ఈ మాత్రం స్కోరు దక్కేది కాదు. విరాట్ కోహ్లీ 60 పరుగులు చేసి రన్ అవుటయ్యాడు.
ఇక.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన అతను బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఆసిఫ్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా అవుటయ్యాడు. మహమ్మద్ హస్నయిన్ వేసిన 15వ ఓవర్లో బంతిని లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా.. మహమ్మద్ నవాజ్కు క్యాచ్ ఇచ్చాడు. నవాజ్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో పాండ్యా పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్లో రాహుల్ (28), రోహిత్ (28), కోహ్లీ (60), సూర్యకుమార్ యాదవ్, (13), రిషబ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (0), దీపక్ హుడా (16), భువనేశ్వర్ 0, రవి బిష్ణోయ్ 8 పరుగులు సాధించారు.