Sunday, May 5, 2024

Breaking: పాకిస్తాన్​కు బిగ్ టార్గెట్‌.. ఫామ్‌లోకి వ‌చ్చిన విరాట్‌ కోహ్లీ..

టీ20 మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌కు బిగ్ టార్గెట్ పెట్టింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయిన ఇండియా 181 ప‌రుగులు చేసింది. పాకిస్తాన్ టార్గెట్ 182 ప‌రుగులుగా ఉంది. దీంట్లో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావ‌డంతో ఈ టార్గెట్ సాధ్య‌మ‌య్యింది. లేకుంటే ఇండియాకు ఈ మాత్రం స్కోరు ద‌క్కేది కాదు. విరాట్ కోహ్లీ 60 ప‌రుగులు చేసి ర‌న్ అవుట‌య్యాడు.

ఇక‌.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన అతను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ఆసిఫ్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా అవుటయ్యాడు. మహమ్మద్ హస్నయిన్ వేసిన 15వ ఓవర్లో బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా.. మహమ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. నవాజ్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో పాండ్యా పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.

ఇక ఈ మ్యాచ్​లో రాహుల్​ (28), రోహిత్​ (28), కోహ్లీ (60), సూర్యకుమార్​ యాదవ్​, (13), రిషబ్​ పంత్​ (14), హార్దిక్​ పాండ్యా (0), దీపక్​ హుడా (16), భువనేశ్వర్​ 0, రవి బిష్ణోయ్​ 8 పరుగులు సాధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement