Saturday, April 27, 2024

Paddy Purchase – ఒక్క రోజే రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు – మంత్రి గంగుల

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామ‌ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి రూ. 3,000 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని సైతం 20వ తేదీకల్లా రైతులకు అందజేస్తామన్నారు మంత్రి గంగుల. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈ యాసంగిలో గురువారం వరకూ 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుండి సేకరించామని మంత్రి తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ. 13,264 కోట్లు అని పేర్కొన్నారు. అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పది రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు చెంతకే వెల్లి ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సేకరణ పూర్తై 6143 కేంద్రాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని మిగతా జిల్లాల్లోనూ ఆదివారం లోగా పూర్తి చేస్తామన్నారు. ఎక్కడైనా ఆలస్యంగా కోతలు చేసిన ప్రాంతాల రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. గత సీజన్ కన్నా 15 లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement