Tuesday, April 30, 2024

Murder Case: అప్సర హ‌త్య‌ కేసులో.. పోలీసుల కస్టడీకి సాయికృష్ణ

హైదరాబాద్‌: శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్‌ పోలీసులు.

అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్‌ పోలీసులు పిటిషన్‌ వేశారు. ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు రెండు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ జరిగే అవకాశముంది. సరూర్‌ నగర్‌ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement