Tuesday, April 30, 2024

ఆయూష్‌ పీజీ వైద్య ప్రవేశాలకు 6 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2022 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు పీజీ ఆయుర్వేదం, హోమియో, యూనానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్‌లో ఈనెల 6న ఉదయం 9 గంటల నుంచి 13వ తేదిన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement