Monday, April 29, 2024

పులివెందులకు షర్మిల…. అన్నకి ఎదురుపడితే ??

మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల సోమవారం పులివెందులకు వెళ్లనున్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. బెంగళూరు నుంచి నేరుగా కడప కు బయలుదేరుతారు షర్మిల. ఇక 2019 మార్చి 16 న వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం షర్మిల తెలంగాణలో లో నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అంటూ కొత్త పార్టీని స్థాపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఏమీ జరగలేదని తెలంగాణ కోడలిగా ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ ఆమె కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఇక జగన్ తో పార్టీ పరమైన విభేదాలు కారణంగానే షర్మిల పార్టీ పెట్టబోతున్నట్లు ఆమె ఆల్రెడీ తెలిపారు. ఇక పార్టీ ఏర్పాట్లు చేపట్టిన తరువాత మొదటి సారిగా షర్మిల పులివెందుల కి వెళుతున్నారు. మరోవైపు జగన్ కూడా రాబోతున్నాడని తెలుస్తోంది. ఒక వేళ జగన్ వస్తే ఈ ఇద్దరూ మాట్లాడుకుంటారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement