Sunday, April 28, 2024

కొనసాగుతున్న అన్వేషణ….ఆయుధాలు ఎక్కడ ?

మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం మూడవ రోజు రెండు ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుంది. పులివెందులలోని రోటరీపురం వాగు, తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని గరండాల వంకలో ఈ అన్వేషణ జరుగుతుంది. నిన్న వాచ్ మెన్ రంగన్న, ప్రకాష్ రెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్ లను సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం మరో కోత్త ప్రాంతంలో ఆయుధాల కోసం అన్వేషణ చేపట్టారు.

ఇప్పటికే వ్యర్థాలను ఇరవై మంది మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. వంకలో బురద ఎక్కువగా ఉండడంతో అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. నిన్న మధ్యాహ్నం జెసీబీ తో వ్యర్థాలను సీబీఐ అధికారులు తొలగించారు. మూడవ రోజు మళ్ళీ రంగంలోకి దిగి పారిశుద్ధ్య కార్మికులతో మరో కోత్త ప్రాంతంలో అన్వేషణ చేపట్టారు. ఈ అన్వేషణ రైల్వే స్టేషన్ మేనేజర్ మోహన్ రెడ్డి సాక్షిగా కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement