Tuesday, May 7, 2024

ఒడిశా సీఎంతో భేటీ కానున్న.. సీఎం జగన్..

భువనేశ్వర్ లో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. రెండు రాష్ట్రాల జల వివాదాల గురించి ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ మేరకు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదం నడుస్తోంది. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే నవీన్ పట్నాయక్ కు జగన్ లేఖ రాశారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఒడిశా జిల్లాలోని గజపతి జిల్లాకు మేలు కలుగుతుందని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. తన ఒడిశా పర్యటనలో నవీన్ పట్నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులనుకూడా జగన్ కలవనున్నారు. ఈ మేరకు జగన్ ఒరిస్సాలో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement