Monday, April 29, 2024

వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ.. అక్టోబర్‌ 7న భారత్‌- పాక్‌ మ్యాచ్‌

వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అక్టోబర్‌ 7వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరుగనుంది. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌తోపాటు భారత్‌- పాక్‌ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.

మెగా టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ మాత్రం ఐపీఎల్‌ ముగిసిన తర్వాత బీసీసీఐ ప్రకటించనుంది. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ… హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లి, లక్నో, గువహటి, కోల్‌కతా, రాజ్‌కోట్‌, ఇండోర్‌, ధర్మశాల స్టేడియాలను ఎంపిక చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement