Friday, May 3, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో- ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయక కార్యక్రమాలు

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు వరద బాధిత ప్రాంతాల్లో సేవా, ఆహార సరఫరా వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ట్రస్ట్ సిబ్బంది, వాలంటీర్లు, స్థానికుల సహకారంతో వరద బారిన పడిన అన్ని ప్రాంతాల్లో వైద్య శిభిరాలు, ఆహారం, తాగునీరు అందించనున్నారు . ఈ కార్యక్రమాల్లో స్థానిక యువత, ప్రజలు తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామ‌న్నారు. ఈ సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్ సమీక్షించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించాలని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందని నారా భువనేశ్వరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement