Saturday, April 20, 2024

ప్రతి ఇంటికి వైఎస్సార్ పథకాలు.. మంత్రి జయరాం

ప్రతి ఇంటికి వైఎస్సార్ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సులువాయి గ్రామం నందు గడపగడపకు వైఎస్సార్ పథకాలను సర్పంచ్ అసనప్ప ఆధ్వర్యంలో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన గడపగడపకు వైఎస్సార్సీపీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. నవరత్నాల ద్వారా ప్రజలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఇంచార్జి నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీ తనయుడు ఈసా, సొసైటీ చైర్మన్ మల్లికార్జున, మండల కో ఆప్షన్ మెంబర్ సాయి బేస్, ఎంపీటీసీలు మల్లికార్జున, కెంచప్ప, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శేషప్ప, వెంకటేష్, మేలగిరి మండల కన్వీనర్లు షఫీ, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement