Sunday, May 5, 2024

ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైర‌స్ విజృంభ‌ణ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఏపీ వ్యాప్తంగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను మ‌రోసారి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ మేర‌కు ఈ రోజు ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 వ‌ర‌కు ప్ర‌తిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని , రాత్రి స‌మ‌యంలో క‌రోనా ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా ఏపీలో ప్ర‌తిరోజు దాదాపు 1,500 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: వాహనదారులకు హెచ్చరిక.. రూల్స్ పాటించకుంటే 15 రోజుల్లో నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement