Friday, April 26, 2024

భీమ్లా నాయక్ నుంచి కొత్త పోస్టర్ లీక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్… రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంతమంది ఇది ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్నారు. ఎందుకంటే అందులో రానా లుక్ నేనే రాజు నేనే మంత్రి సినిమా కి సంబంధించిన స్టైల్ లో కనిపిస్తోంది. ఏదేమైనా ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement