Thursday, May 16, 2024

ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు నిర్దిష్టంగా నమోదవుతున్నాయి తాజాగా గడిచిన 24 గంటలలో 91,849 సాంపిల్స్ ని పరీక్షించగా 4,458 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది, కృష్ణ లో ఎనిమిది, గుంటూరు లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 6,313 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,15,41,485 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం కేసుల సంఖ్య…1871475
యాక్టీవ్ కేసుల సంఖ్య….47790
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1811157
మొత్తం మృతుల సంఖ్య….12528

Advertisement

తాజా వార్తలు

Advertisement