Thursday, May 2, 2024

New Colleges – బాల్కొండ, ముధోల్ లో డిగ్రీ, క‌మ్మ‌ర‌ప‌ల్లిలో ప్ర‌భుత్వ‌ జూనియ‌ర్ కాలేజీలు

హైద‌రాబాద్ – రాష్ట్ర‌లో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లిలో జూనియర్‌ కళాశాలకు సైతం జూనియర్‌ కాలేజీని మంజూరు చేసింది.

ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మూడు రోజుల కిందట ప్రభుత్వం రెండు ఇంజినీరింగ్‌ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. జీఎన్టీయూ హెచ్‌ పరిధిలోని మహబూబాబాద్‌, పాలేరులో ఇంజినీరింగ్‌ కాలేజీలకు, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ జీవోలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement