Monday, April 29, 2024

హీటెక్కిన సోషల్ మీడియా.. జనం సొమ్మును కత్తి మహేష్‌కు ఎలా ఇస్తారు?

నెల్లూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ ప్రభుత్వం రూ. 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. సీఎం సహాయ నిధి నుంచి ఈ నగదును అందిస్తూ.. అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి శుక్రవారం లేఖ విడుదల చేశారు.

కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం హరికృష్ణ లెటర్ ద్వారా తెలియజేశారు. అయితే కత్తి మహేష్‌కి జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్తువెత్తాయి. అసలు కత్తి మహేష్‌కి ఏ లెక్కన అంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారని.. సాధారణ ప్రజలకు ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇలాగే స్పందిస్తున్నారా? కత్తి మహేష్‌ విషయంలో ఇంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సాయం చేయాలనుకుంటే తన సొంత డబ్బులు ఇవ్వాలని లేదంటే వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అయినా మంజూరు చేయాలి తప్ప ప్రజల డబ్బును కత్తి మహేష్‌కు పంచడం కరెక్ట్ కాదని నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

విడాకులు తీసుకున్ అమీర్ ఖాన్ దంపతులు

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement