Wednesday, May 1, 2024

Neeraj Chopra: ఒక్క రోజులో 25 లక్షలు ఫాలోవర్స్..

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా కు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా మొత్తం నీరజ్ చోప్రా జపంతోనే మునిగిపోతోంది. ఇక నీరజ్ పర్శనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. కేవలం ఒక్క రాత్రిలోనే 25 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు పెరిగారు. ప్ర‌స్తుతం నీర‌జ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 2.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆయ‌న 160 మందిని ఫాలో అవుతున్నారు. ఆయ‌న ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు వెళ్ల‌క‌ముందు.. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేవ‌లం 1.43 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే ఉండేవారు. అంటే గోల్డ్ మెడల్ సాధించాక నీరజ్ క్రేజ్ ఏమాత్రం పెరిగిందో అర్థ చేసుకోవచ్చు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాక‌.. గోల్డ్ మెడ‌ల్‌తో దిగిన ఫోటోల‌ను కూడా నీర‌జ్.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ద‌ళితలను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి: మీరా మిథున్

Advertisement

తాజా వార్తలు

Advertisement