Friday, April 19, 2024

డ్యాన్స్ వేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డ్యాన్స్ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ మేరకు గిరిజనుల పిల్లలతో కలిసి ఆమె డ్యాన్స్ వేశారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే  జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement