Saturday, May 18, 2024

ఛత్తీస్ ఘ‌డ్ లో న‌క్స‌ల్స్ దుశ్చ‌ర్య

ఛత్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలో న‌క్స‌ల్స్ మ‌రోసారి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని రెంగబెడలో రోడ్డు నిర్మిస్తున్న నాలుగు వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. మంటల్లో నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనను అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఐపీఎస్ అక్షయ్ కుమార్ ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement