Wednesday, May 1, 2024

Delhi: కాంగ్రెస్ కు నేష‌న‌ల్ హెరాల్డ్ పోయే… ఎన్నిక‌ల వేళ హ‌స్తంకు దెబ్బ మీద దెబ్బ

ఇప్ప‌టికే బ్యాంక్ ఖాతాలు సీజ్
నేష‌నల్ హెరాల్డ్ ఆస్తులు సైతం సీజ్
పీఎంఎల్ఏ అథారిటీకి అప్పీల్..
ఆస్తుల సీజ్ స‌బ‌బేనంటూ తీర్పు..

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇన్ కంట్యాక్స్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. తర్వాత రిలీజ్ చేసినప్పటికీ వంద కోట్లకు పైగా నిధులను బ్లాక్ చేసింది. దీంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఖర్గే, రాహుల్ సహా పలు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేషనల్ హెరాల్డ్ పేపర్ సహా పలు సంస్థలకు చెందిన రూ.752 కోట్ల ఆస్తులను గతేడాది సీజ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం బాటపట్టి, పీఎంఎల్ఏ అథారిటీని ఆశ్రయించింది. తాజాగా, ఈ విషయంపై తీర్పు చెబుతూ.. ఆస్తుల అటాచ్ సబబేనని పీఎంఎల్ఏ అథారిటీ తేల్చిచెప్పింది. ఈడీ ఎటాచ్‌ చేసిన చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీలాండరింగ్‌ నేరానికి సంబంధించినవిగా భావిస్తున్నట్లు పేర్కొంది.

ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు..
స్వాతంత్య్రానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. నష్టాల కారణంగా ఈ పత్రిక 2008లో మూతపడింది. కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ రూ.90కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో పాటు సంస్థకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగ పరిచిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ నష్టాల్లో కూరుకుపోయింది. యంగ్ ఇండియన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సోనియా, రాహుల్ ఉండడం గమనార్హం. ఈ కంపెనీని 2010లో ఏజీఎల్ కొనుగోలు చేసింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారాల్లో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. గతేడాది నేషనల్ హెరాల్డ్ కు చెందిన పలు ఆస్తులను జఫ్తు చేసింది. దీనిపై కాంగ్రెస్ అప్పీల్ కు వెళ్లిన ప్ర‌యోజ‌నం లేక‌పోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement