Thursday, May 16, 2024

చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల పర్యటన వాయిదా పడింది. ప్రతి ఏటా మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చి, నిత్యాన్నదాన పథకానికి ఒక రోజు ఖర్చయ్యే మొత్తాన్ని విరాళంగా టీటీడీకి అందజేస్తుంటారు. అయితే ఈసారి వ్యక్తిగత కారణాల వల్ల తిరుమల పర్యటన రద్దయినట్టు తెలిసింది. దీంతో విరాళం మొత్తాన్ని హైదరాబాద్ నుంచే టీటీడీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కాగా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి ప్రతి ఏడాది చంద్రబాబు రూ.30 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement