Monday, April 29, 2024

పట్టభద్రులపై వాణీదేవి సీరియస్..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు ఈరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఏడు రౌండ్ల లో ఏ ఒక్కరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి శుక్రవారం సరూర్ నగర్ కౌంటింగ్ కేంద్రాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. చాలామంది పట్టభద్రులు వేసిన ఓట్లు చెల్లడం లేదని, మేం నేర్పిన చదువు ఇదేనా… అంటూ పట్టభద్రులపై అసహనం వ్యక్తం చేశారు వాణీదేవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement