Saturday, May 4, 2024

Namibia: క్యాన్స‌ర్ తో న‌మీబియా అధ్య‌క్షుడు హేజ్ గింగోబ్ క‌న్నుమూత‌..

విండ్‌హోక్‌: నమీబియా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్ (82) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం దేశ రాజధాని విండ్‌హెక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

ఆయనకు ఇటీవలే క్యాన్సర్‌ నిర్ధరణ కాగా చికిత్స కోసం అమెరికా వెళ్తారని వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన మరణ వార్త దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైన గింగోబ్‌ దీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, తదుపరి కార్యాచరణపై కేబినెట్‌ భేటీ అనంతరం ప్రకటన చేస్తామని తాత్కాలిక అధ్యక్షుడు అంగోలో ముంబా తెలిపారు. నవంబరులో దేశంలో అధ్యక్ష, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement