Saturday, May 4, 2024

న‌ల్గొండ‌లో నిత్య పెళ్ళి కొడుకు ‘విలియ‌మ్స్’..19మంది యువ‌తుల‌ను ట్రాప్..

న‌ల్గొండ‌లో నిత్య పెళ్ళి కొడుకు విలియ‌మ్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది యువతులను ట్రాప్‌ చేశాడు ఈ నిత్య పెళ్లి కొడుకు. మొదటి భార్య ఫిర్యాదు తో ఈ నిత్య పెళ్లి కొడుకు యవ్వారం బయట పడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ కొట్టిస్తున్నాడు విలియమ్స్ అనే యువకుడు. చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నాడు. చర్చికి వచ్చే యువతులు, మహిళలను లోబర్చుకున్న విలియమ్స్… సుమారు 19 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు…మొదటి భార్య తనూజ… ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది నిత్యపెళ్ళి కొడు విలియమ్స్ బాగోతం. అయితే… పోలీసులు అదుపులోకి తీసుకునే యత్నంలో విలియమ్స్ హైడ్రామా క్రియేట్ చేశాడు. గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే.. ఆస్పత్రి నుంచి విలియమ్స్ ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement