Thursday, May 2, 2024

Nagpur – ఫ్లైవోవర్‌పై నుంచి రైల్వే ట్రాక్ పై పడిన కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైవోవర్‌పై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి దానికింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సిటీలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కారు రైల్వే ట్రాక్‌పై పడటం చూసిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో కలిసి క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement