Monday, May 6, 2024

జానారెడ్డి రెడి….మిగిలిన వారు ఎక్కడ ?

సాగర్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జానారెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తూ ఏఐసిసి ప్రకటన విడుదల చేసింది.కాగా మరోవైపు ఇప్పటివరకు అధికార టిఆర్ఎస్ , బిజెపి పార్టీ లు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నెల 23న ఈసి సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు కూడా సాగర్ పై ఫోకస్ పెట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement