Tuesday, May 14, 2024

ప్రభుత్వానికి నాస్వరం బలంగా వినిపిస్తా.. గవర్నర్ తమిళిసై

ప్రభుత్వానికి నా స్వరం బలంగా వినిపిస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహిళా దర్భార్ లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మహిళలకు సోదరిలా మీ వెంటే ఉంటానన్నారు. మహిళలకు, ప్రభుత్వానికి వంతెనలా ఉంటానన్నారు. తాను చేసేపనులకు ఎవరు అడ్డుచెప్పినా పట్టించుకోనన్నారు. తనను ఎవరూ అడ్డుకోలేరన్నారు. సమస్యలు వస్తే మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కరోనా సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దని చెప్పినా నిమ్స్ ఆస్పత్రిలో ప్రజలను కలిశానన్నారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై గవర్నర్ కు మహిళలు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement