Sunday, April 28, 2024

Karnataka | నిధుల నెపంతో హ‌త్య‌.. కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ కారులో మూడు కాలిపోయిన మృతదేహాలు క‌నిపించ‌డం కలకలం రేపింది. మృతుల‌ను మంగళూరులోని బెల్తంగడి తాలూకాకు చెందిన వారిగా గుర్తించారు. కాగాచ, పోలీసులు, దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు.

- Advertisement -

బాధితులను వేరే ప్రాంతంలో హత్య చేసి, ఇక్కడికి తీసుకొచ్చి మృతదేహాలను కాల్చివేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిధిలో దొరికిన బంగారు ఆభరణాలను విక్రయిస్తామని నమ్మించిన దుండగులు వారిని హత్య చేసి డబ్బు, నగలు దోచుకెళ్లారు. వారి మృతదేహాలను వాహనంలోనే దహనం చేశారు. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న ముఠాను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కెవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement