Sunday, April 28, 2024

Murder – లైవ్ స్టీమింగ్ లో హ‌త్య‌… ఆపై నిందితుడు ఆత్మ‌హ‌త్య‌..

ముంబై – లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించిన శివసేన పార్టీకి చెందిన యూటీబీ నేతను కాల్చివేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసార్ ప్రాంతంలో గ‌త రాత్రి జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని అభిషేక్‌గా ఘోసాల్కర్‌గా గుర్తించారు. ఈయన మహారాష్ట్ర శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ కీలక నేత కుమారుడు కావడం గమనార్హం. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించి నిందితుడు మారిస్ నోరాన్హా. అభిషేక్‌ను తుపాకీతో కాల్చిన నోరాన్స్.. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముంబై దహిసార్ ప్రాంతంలోని ఎం.హెచ్.బి. పోలీస్స స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్‌ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతనికి విభేదాలు ఉండగా, ఇటీవలే వాటిని పరిష్కరించుకుని రాజీకి వచ్చారు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్‌కు అభిషేక్‌ను ఆహ్వానించిన మారిస్.. ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు మరో హత్య జరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement