Thursday, May 16, 2024

NZB: సిరికొండ సొసైటీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

సిరికొండ, ఫిబ్రవరి 9 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీ చైర్మన్ ఛాంబర్ లో 11మంది డైరెక్టర్లతో జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సొసైటీ డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఫిర్యాదు మేరకు వారితో చర్చించిన అనంతరం 11మంది సభ్యులందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి చైర్మన్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ పిలిప్ ఇరువురిపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా డైరెక్టర్లు చేతులెత్తారు.

అనంతరెడ్డి సిరికొండ సొసైటీ డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ఫిర్యాదు మేరకు శుక్రవారం సిరికొండ సొసైటీ చైర్మన్ చాంబర్ లో సమావేశాన్ని నిర్వహించి డైరెక్టర్ల అభిప్రాయం మేరకు ఇప్పటి వరకు చైర్మన్ వైస్ చైర్మన్లుగా వ్యవహరించిన గంగారెడ్డి ఫిలిప్ లను తొలగిస్తున్నట్లు డీసీఓ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై జి.రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement