Tuesday, May 7, 2024

తల్లీకూతుళ్లను హత్యచేసి లొంగిపోయిన కిరాతకుడు..

గుంటూరు జిల్లాలో తల్లికూతుళ్ల హత్యలు కలకలం రేపాయి. సొంత చిన్నాన్న కొడుకే కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతుళ్లు వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూషను నిందితుడు శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలను చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు. కత్తితో పొడుస్తున్న దుర్మార్గుడితో తల్లీకూతుళ్లు పెనుగులాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తల్లీకూతుళ్లు రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలారు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. దాయాదుల మధ్య నెలకొన్న పొలం వివాదంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

ఇది కూడా చదవండి: బ్లాక్ మెయిల్ పనులు మానుకోః రేవంత్ కు మల్లారెడ్డి కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement