Thursday, May 16, 2024

Delhi | కొత్తవలస ప్రమాదంపై విచారణ జరిపించండి.. రైల్వే బోర్డుకు ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఈస్ట్ కోస్ట్ జోన్‌లో రైళ్ల భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన న్యూఢిల్లీలో రైల్వే బోర్డ్ ఛైర్‌పర్సన్ జయవర్మ సిన్హాను కలిసి వినతి పత్రం సమర్పించారు.

విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని కొత్తవలస వద్ద జరిగిన రైలు ప్రమాదంపై లోతైన సమీక్ష జరపవలసినదిగా అభ్యర్థుంచారు. ఐదు నెలల్లో రెండు భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడంపై జీవీఎల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతకు చర్యలు చేపట్టవలసినదిగా జయవర్మను ఆయన కోరారు. మెరుగైన చర్యలు చేపడతామని ఆమె జీవీఎల్‌కు హామీ ఇచ్చారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement