Monday, May 6, 2024

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుడుని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement