Tuesday, May 7, 2024

హాంకాంగ్‌లో మోదీ ఆస్తులు సీజ్‌.. 254కోట్ల ఆస్తులు అటాచ్ చేసుకున్న‌ ఈడీ

భార‌త బ్యాంకుల‌ను మోసం చేసి ఫారెన్‌లో త‌ల‌దాచుకున్న మోదీ ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసింది. బ్యాంకుల‌కు వేలాది కోట్ల రుణాల‌ను ఎగ‌వేసి ఫారెన్‌కు పారిపోయిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) శుక్ర‌వారం మ‌రో అడుగు ముందుకేసింది. హాంగ్‌కాంగ్‌లోని మోదీకి చెందిన కంపెనీల‌కు చెందిన ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా సీజ్ చేసిన ఆస్తుల్లో మొత్తం రూ.253.62 కోట్ల విలువ చేసే ప‌లు అభ‌ర‌ణాల‌తో పాటు కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని న‌గ‌దు నిల్వ‌లున్నాయి.

లేటెస్ట్‌గా సీజ్ చేసిన ఆస్తుల‌తో క‌లిపి ఇప్ప‌టిదాకా నీర‌వ్ మోదీకి చెందిన రూ.2,650.07 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుల‌కు దాదాపుగా రూ.28 వేల కోట్ల పైచిలుకు రుణాల‌ను ఎగ‌వేసిన నీర‌వ్ మోదీ.. 2018లో దేశం వ‌దిలి ప‌రారయ్యాడు. తొలుత అమెరికా, ఆ త‌ర్వాత ఇంగ్లండ్ చేరిన మోదీని ఈ మ‌ధ్య‌నే బ్రిట‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement