Sunday, May 5, 2024

టీమ్ ఇండియా న‌యా వాల్ చ‌తేశ్వ‌ర్ కు మోడీ విషెస్..

టీమ్ ఇండియా నయా వాల్ చ‌తేశ్వ‌ర్ పుజారా వందో టెస్ట్ మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఈ వందో మ్యాచ్ కి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ జ‌రిగే రెండో టెస్టు మ్యాచ్ వేదిక కానుంది. ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్‌ల ఆడారు. ఇప్పుడు ఆ జాబితాలో పుజారా చేర‌నున్నాడు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఆడనున్న పుజారాకు ప్రధాని మోడీ నుంచి ముందస్తు అభినందనలు అందాయి. 100వ టెస్టుకు ముందు పుజారా ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా పుజారాను మోడీ అభినందించారు.. ఈ ఫోటోల‌ను చ‌తేశ్వ‌ర్ త‌న ట్విట్ట‌ర్ లో ఫోస్ట్ చేశాడు. ‘ఈ క్షణాలు నా ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రధాని మోదీని కలవడం నాకు గర్వకారణం. స్పెషల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు’ అంటూ ట్విట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement