Thursday, April 25, 2024

సేవాలాల్ జయంతిలో అపశృతి.. విద్యుత్ షాక్ తో ఒకరు మృతి..

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తండాలోని గిరిజనులు జండా ఎగరవేస్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు విద్యుత్ షాకుక్ గురయ్యారు. గ్రామానికి చెందిన మూడు సుభాష్ (27) సంఘటనా స్థలం వద్ద మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరో ఇద్దరు శంకర్, హరీష్ అనే వ్యక్తులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వేడుకలు చేసుకుందామని గిరిజనులు ఎంత ఉత్సాహంగా జరుపుకునే సందర్భంలో అపశృతి ఎదురుకావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుభాష్ కు ఇద్దరు పిల్లలు, భార్య. రుద్రూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement