Thursday, April 25, 2024

నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేస్ లో ప్ర‌ధాని మోడీ…

స్వీడ‌న్ – భారత ప్రధాని నరేంద్ర మోదీని ఈ ఏడాది ప్రపంచ ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్ అవార్డు వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీనే అతి పెద్ద పోటీదారు అని నోబెల్ కమిటీ డిప్యూటీ నేత ఆష్లే టోజే వెల్లడించారు. ప్రపంచంలో శాంతికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి మోడీనేనని ఆష్లే టోజే అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపగల సమర్థత భార‌త ప్ర‌ధానికి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ సంపన్న, శక్తిమంతమైన దేశంగా అవతరిస్తోంది అని వివరించారు. ప్రపంచ నేతలు మోడీలా ఉండాలని అభిలషించారు. కాగా,అక్టోబరు మాసంలో నోబెల్ అవార్డులు ప్రకటించనున్నారు.

https://twitter.com/AdvAshutoshBJP/status/1635994884862787585
Advertisement

తాజా వార్తలు

Advertisement