Tuesday, March 26, 2024

సిసోడియాపై మ‌రో కేసు..

ఢిల్లీ – అప్ సీనియ‌ర్ నేత‌, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాపై సిబిఐ మ‌రో కేసు న‌మోదు చేసింది..అవినీతిని అరికట్టేందుకు కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ లోనే అవినీతి జ‌రిగిందంటూ సిసోడియాపై ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు.. పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లా పనిచేసిందని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. ‘‘ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయడం, దానితో అక్రమంగా పని చేయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.36 లక్షల వరకు నష్టం వాటిల్లింది’’ అని పేర్కొంది. ఈ కేసులో ఇప్ప‌టికే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ సెక్రటరీ సుకేశ్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేశ్ కుమార్ సిన్హాతోపాటు ప్రదీప్ కుమార్ పంజ్, సతీశ్ కేత్రపాల్, గోపాల్ మోహన్ పైనా కేసు నమోదు చేసింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement