Sunday, April 28, 2024

జాతీయ మహిళా లెజిస్లేచర్‌ సదస్సుకు ఎమ్మెల్సీ కవిత.. కేరళ అసెంబ్లీలో 25 నుంచి సదస్సు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేరళ అసెంబ్లి నిర్వహించనున్న జాతీయ మహిళా లెజిస్లేచర్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈనెల 25 నుంచి 27 వరకు తిరువనంతపురంలో ఈ కాన్ఫరెన్స్‌ జరగనుంది. ఇందులో భాగంగా నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం అనే అంశంపై ఈనెల 27న కవిత ప్రసంగించనున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఇదే అంశంపై ఉత్తరాఖండ్‌ అసెంబ్లిd గవర్నర్‌ రీటా ఖండూరీ, అన్నీ రాజా సైతం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement