Sunday, May 19, 2024

AP | టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని, రాష్ట్రాన్ని బాగు చేయగలిగేది చంద్రబాబు ఒక్కరేనన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. అందుకే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement