Thursday, May 2, 2024

High Court – గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదం – విచార‌ణ రేప‌టికి వాయిదా …

హైద‌రాబాద్ – గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదంపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.. వాద‌న‌ల అనంత‌రం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే ఎమ్మెల్సీల ప్ర‌మాణ స్వీకారం విధించిన స్టేట‌స్ కో నేటితో ముగియ‌నుండటంతో దానిని కూడా రేప‌టి వ‌ర‌కు పొడిగించింది..

కాగా, నామినేటేడ్ కోటాలో బీఆర్ఎస్ నేతలు నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎన్నికను గవర్నర్ తమిళి సై నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో వీరు గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేబినెట్ ఆమోదించినప్పటికీ తమ నియామకంలో గవర్నర్ తన అధికార పరిధికి మించి వ్యహహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఎన్నికపై క్లారిటీ వచ్చే వరకు నామినేటేడ్ కోటా నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికపై కోర్టు స్టేట‌స్ కో విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement