Tuesday, May 7, 2024

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు – ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి

గురు పౌర్ణమి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సాయిబాబా దేవాలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించి మొక్కలు చెల్లించారు. తెల్లవారుజాము నుండి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వర్షాల కారణంగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement