Thursday, May 16, 2024

మిథాలీరాజ్ మరో రికార్డు

భారత్‌ మహిళా వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ.. ఇప్పుడు వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి మహిళగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్‌ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ తీసి మైలురాయిని అందుకుంది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్‌ (4844) ఉన్నారు. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయ ఉమెన్‌ క్రికెటర్‌గా నిలిచింది. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీరాజ్‌.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో.. 50.7 సగటుతో 7008 పరుగులు చేయగా.. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధసెంచరీలు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement