Saturday, May 4, 2024

దిల్ రాజుకి స్టార్ట్ అయింది?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు పేరు తెచ్చుకున్నారు. ఎస్.వి.సి బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. అయితే ఎస్.వి.సి బ్యానర్ లో దిల్ రాజు తో పాటు శిరీష్, లక్ష్మణ్ పేర్లు కూడా ఉంటాయి. సినిమా చేసేటప్పుడు ఈ ముగ్గురు కూడా ఓకే అనుకుంటేనే సినిమా చేస్తారు. కాగా గత కొంత కాలం క్రితం దిల్ రాజు కు లక్ష్మణ్ కు విభేదాలు రావడంతో ఎస్.వి.సి బ్యానర్ నుంచి లక్ష్మణ్ బయటికి వచ్చేశారు. బ్రిడ్జి ఫిలిమ్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించారు.

అయితే ఇటీవల అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాకు లక్ష్మణ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టక్ జగదీష్ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కూడా లక్ష్మణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్.వి.సి నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా సొంత బ్యానర్ లక్ష్మణ్ స్పీడ్ కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన నెటిజన్లు దిల్ రాజు కి పోటీ తగిలినట్టే అంటూ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement