Tuesday, May 7, 2024

అదృశ్యమైన మహిళా ఉరి వేసుకుని మృతి..

మల్హర్, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలంలోని రుద్రారంలో ఆదివారం ఉదయం మలవిసర్జనకు బయటకు వెళ్లిన సానుగు రమ (46) శవమై క‌నిపించింది. వివరాల్లోకి వెళ్లగా మృతురాలు కుమారుడైన విజయ్.. తల్లి క‌నించడం లేదు అని వెతకడానికి బంధువుల ఊర్లోకి వెళ్లి చేశాడు.. ఆచూకీ దొరకకపోవ‌డంతొ.. విజయ్ మంగళవారం సాయంత్రం త‌న‌ తల్లి వెళ్లిన దారికి గుండా వెళ్లగా.. సమీపాన ఉన్న అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని క‌నిపించింది. విష‌యం తెలియ‌డంతో గ్రామస్థులు అందరూ సంఘటన స్థలానికి వెళ్లిపోయారు. కొయ్యుర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement